దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరైన, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే మరోసారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సాల్వే 68 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్నాడు. సాల్వే ఇటీవల లండన్లో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలో త్రినాను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి నీతా అంబానీ, లలిత్ మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.దేశంలో టాప్ లాయర్ మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే ముచ్చటగా మూడోసారి పెళ్లి కొడుకయ్యారు. 68 ఏళ్ల వయస్సులో ఆయన వివాహం చేసుకున్నారు. లండన్లో జరిగిన హరీశ్సాల్వేకు అతిరథమహారథులు హాజరయ్యారు. ట్రీనాను పెళ్లి చేసుకున్నారు హరీశ్సాల్వే.. జమిలి ఎన్నికల కోసం కేంద్రం నియమించిన కమిటీలో కూడా కీలకసభ్యుడిగా ఉన్నారు హరీశ్సాల్వే.
దేశంలోని ప్రముఖ్య వ్యాపారవేత్తలంతా హరీశ్సాల్వే మ్యారేజ్కు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ, నీతాఅంబానీ , సునీల్ మిట్టల్ , లక్ష్మి నివాస్ మిట్టల్ గోహి హిందూజా విందుకు హాజరయ్యారు. అంతేకాదు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ , ఆయన గార్ల్ఫ్రెండ్ ఉజ్వల్ రౌత్ కూడా పార్టీలో పాల్గొన్నారు.హరీశ్సాల్వే తన మొదటి భార్య మీనాక్షికి 2020లో విడాకులు ఇచ్చారు. తరువాత కరోలిన్ బ్రసార్డ్ను పెళ్లి చేసుకున్నారు. హరీశ్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తరపున పలు కేసులను వాదించారు. కుల్భూషణ్ జాదవ్ కేసులో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు.టాటాగ్రూప్ , రిలయన్స్ సంస్థలకు కూడా ఆయన లీగల్ అడ్వయిజర్గా ఉన్నారు.
1999 నుంచి 2002 వరకు సొలిసిటర్ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు హరీశ్ సాల్వే.హరీష్ సాల్వే వృత్తిరీత్యా కళాకారిణి అయిన కరోలిన్ బ్రాస్సార్డ్ను 2020లో వివాహం చేసుకున్నారు. ఇది మాత్రమే కాదు, సాల్వే క్రైస్తవ మతంలోకి మారారు. ఇక సాల్వే మొదటి భార్య గురించి చెప్పాలంటే ఆమె పేరు మీనాక్షి సాల్వే. హరీష్ సాల్వే 2020 ప్రారంభంలో తన మొదటి భార్య మీనాక్షి సాల్వే నుండి చట్టబద్ధంగా విడిపోయారు. ఇద్దరికీ ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పేరు సాక్షి కాగా, చిన్న కూతురు పేరు సానియా. ఇప్పుడు మరోసారి లండన్లో త్రినా అనే మహిళను సాల్వే మూడో పెళ్లి చేసుకున్నాడుదేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లలో హరీశ్ సాల్వే పేరున్న సంగతి తెలిసిందే.
సాల్వే 2003లో అంతర్జాతీయ వ్యవహారాలను సమర్థించడం ప్రారంభించారు. దీని తరువాత అతను లండన్లో మాత్రమే నివసించడం ప్రారంభించాడు. అతను 2013లో ఇంగ్లీష్ బార్లో నియమితుడయ్యాడు. అదే సంవత్సరంలో క్వీన్స్ కౌన్సెల్గా నియమించబడ్డాడు. ఇది మాత్రమే కాదు, సాల్వే వోడాఫోన్, ముఖేష్ అంబానీ, రతన్ టాటా , పెద్ద వ్యక్తుల కేసులపై కూడా పోరాడారు.సాల్వే లండన్లో నివసిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే భారతదేశంలో చట్టాన్ని అభ్యసిస్తున్నారు. దీనితో పాటు, సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతదేశం తరపున కులభూషణ్ జాదవ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు, దీనికి అతను కేవలం ఒక రూపాయి మాత్రమే తీసుకున్నాడు. ఈ కేసులో సాల్వేపై చాలా ప్రశంసలు వచ్చాయి.