పాకిస్థాన్, చైనా నుంచి వస్తున్న సరిహద్దు సమస్యలను ఎదుర్కొనేందుకు శ్రీనగర్ బేస్ను మరింత పటిష్టం చేశారు. ఆ బేస్ వద్ద ఇప్పుడు మిగ్-29 యుద్ధ విమానాలకు చెందిన స్క్వాడ్రన్లను మోహరించారు. మిగ్-21 బృందాల స్థానంలో ఇప్పుడు మిగ్-29 బృందాలు పనిచేయనున్నాయి. ఈ బృందాన్ని డిఫెండర్ ఆఫ్ నార్త్గా పిలుస్తున్నారు.మిగ్-29 చాలా అప్గ్రేడ్ యుద్ధ విమానాలని పైలెట్ స్క్వాడ్రన్ లీడర్ శివమ్ రాణా తెలిపారు. నైట్ విజన్ గగూల్స్తో ఈ విమానాలను రాత్రి పూట కూడా ఆపరేట్ చేయవచ్చు అన్నారు.
ఎయిర్ టు ఎయిర్ రీఫ్యుయలింగ్ సామర్థ్యం ఉన్న కారణంగా .. వీటిని లాంగ్ రేంజ్లో కూడా ఆపరేట్ చేయవచ్చు అని చెప్పారు. భారతీయ వైమానిక దళానికి చెందిన పైలెట్లే ఈ విమానాలను ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు.కశ్మీర్ లోయలో శ్రీనగర్ చాలా ఎత్తు ప్రదేశంలో ఉందని, ఇలాంటి ప్రదేశంలో మిగ్-29 యుద్ధ విమానాన్ని మోహరించడం చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఐఏఎఫ్ పైలెట్ స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ తెలిపారు. లాంగ్ రేంజ్ మిస్సైళ్లు లాంచ్ చేయడానికి వీలుగా ఉంటుందన్నారు.