A place where you need to follow for what happening in world cup

ప్రభుత్వానికి దండాలు పెడుతూ వినూత్న నిరసన తెలిపిన మధ్యాహ్న భోజన వాంట కార్మికులు

మధ్యాహ్న భోజన వంట కార్మికులకు రావలసిన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవదిక సమ్మె 10వ రోజు భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఒంటి కాలుపై నిలబడి దండాలు పెడుతూ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన వంట కార్మికులకు పెంచిన వేతనాలు పెండింగ్ బిల్లులు విడుదల చేసామని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి పత్రికలలో స్టేట్ మెంట్ ఇచ్చి 3 రోజులు కావొస్తున్న నేటికీ కార్మికుల బ్యాంక్ ఖాతాలలో పూర్తిగా డబ్బులు రాలేదని అయన అన్నారు. అందరి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వచ్చే వరకు సమ్మె యధావిధిగా కొనసాగుతుందని అయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకోవాలనే ఆలోచన ఉంది తప్ప, కార్మికులకు మేలు చేసే ఆలోచన ప్రభుత్వ వద్ద కనపడటం లేదని అని ఆరోపించారు. నూతనంగా జారీ చేసిన మెనూ ప్రకారం వంటలు చేయాలంటే కనీసం ప్రతి కార్మికునికి రూ.26,000/- ఇవ్వాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్న భోజన వంట కార్మికుల జిల్లా అధ్యక్షురాలు బాగుల వసంత, ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, ఉపాధ్యక్షులు జిన్న కృష్ణ నాయకులు నిర్మల, సంధ్య, లక్ష్మీ, స్వప్న, అనసూర్య, అండాలు, వాణి, కృష్ణవేణి, లలిత, సుగుణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.