A place where you need to follow for what happening in world cup

హామీలను విస్మరించిన సర్కారుకు నివేధించండి

బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని ప్రజలకు ఎన్నో హామిలిచ్చి విస్మరించిందని ప్రభుత్వ వైఫల్యాలను నివేధించాలని టిడిపి నేతలు కోరారు. మంగళవారం రాష్ట్ర సర్కారు వైఫల్యాలపై టిడిపి నేతలు నిరసనతో కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికల్లో, వివిధ సందర్భాల్లో సిఎం కెసిఆర్ సర్కారు రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు, మైనార్టీలకు, గిరిజనులకు, దలితులకు అనేక హామిలిచ్చిందన్నారు. ఏండ్లు గడుస్తున్నా హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 22 లక్షల మంది ఇండ్లు లేని నిరుపేదలుంటే 3 లక్షల డబుల్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పి పూర్తిస్థాయిలో నిర్మించక విఫలమైందన్నారు. స్వంత స్థలం ఉన్నోళ్లకు 5 లక్షలు ఇస్తామని ఇప్పుడు 3 లక్షల పేరుతో అమలు పనిని మూడు రోజులకే ముగించిందన్నారు.

2 లక్షల పోస్టులు ఖాళీ ఉంటే 80 వేలకు నోటిఫికేషన్ ఇచ్చి లీకుల పేరుతో యువతను మోసగిస్తోందన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని దీంతో బ్యాంకులు వడ్డీతో ఇచ్చే రుణమాఫీ వడ్డీకే సరిపోతోందన్నారు. సర్వరోగ నివారిణి ధరణి అంటున్న రాష్ట్ర ప్రభుత్వం లోపాలను సరిచేయడాన్ని విస్మరించిదన్నారు. దళితుల మూడెకరాల భూమి నామ్ కె వాస్తేగా మారిందన్నారు. గిరిజనులకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, 6 వేల నుంచి 12 వేల కోట్ల నిధులతో సంక్షేమాన్ని అమలు చేయడాన్ని విస్మరించిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేసేలా ప్రభుత్వానికి నివేధించాలని టిడిపి నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి బిసి సెల్ ఉపాధ్యక్షులు ఓరుగంటి భార్గవ రామ్,టిడిపి రాష్ట్ర ఆర్గనైసింగ్ సెక్రటరీ అక్కిన పల్లి కాశినాథం, టిడిపి నాయకులు బత్తుల కొండయ్య యాదవ్, సోమ నారాయణ రెడ్డి, కొండ శ్రీధర్,  సాన రాములు, మోర గణేష్, బొల్లారపు రాజేశంతోపాటు పలువురు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.