A place where you need to follow for what happening in world cup

ఇప్పటిదాకా చూసింది కేవలం టైలర్ మాత్రమే

  • త్వరలో ప్రతిపక్షాలకు బిఆర్ఎస్ పార్టీ సినిమా వుంది
  • మంత్రి కే. తారక రామారావు

ఇందిరా పార్క్ కు నుంచి వి ఎస్ టి చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిను ( నాయిని నరసింహారెడ్డి ఫ్లై ఓవర్) పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు శనివారం ప్రారంభించారు.మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చినంక కట్టిన 20వ ఫ్లై ఓవర్ ఇది. ఎస్ఆర్డీపీ  కార్యక్రమంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. అద్భుతమైన అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా 36 పనులను పూర్తి చేశాము. గత ప్రభుత్వాలు హైదరాబాద్ సెంట్రల్ నగరాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  ఆధ్వర్యంలో నూతన సచివాలయం, అమరవీరుల స్తూపం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జి వంటి అనేక కార్యక్రమాలతో సెంట్రల్ హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. దీంతోపాటు ఇందిరా పార్కును కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు.ఈ బ్రిడ్జి ఏర్పాటుతో ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ దాకా దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

ఈ ప్రాంతంతో అద్భుతమైన సంబంధాలు ఉన్న కీర్తిశేషులు నాయిని నరసింహారెడ్డి అనుబంధాన్ని, ఆయన ఇక్కడి ప్రజలకు… కార్మికులకు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరును పెడుతున్నాం. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.గతంలో మాదిరి మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే దుస్థితి ఈరోజు లేదు. గత పది సంవత్సరాలలో మత కల్లోలాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నది. ఇలాంటి సందర్భంలో మతాల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గులకు, చిల్లర పార్టీల వారి మోసాలకు గురైతే మరో వందేళ్లు ఈ నగరం వెనక్కి పోతుందని అన్నారు. 60 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయని పార్టీల మోసపు మాటలు నమ్మవద్దు. ఇప్పటిదాకా చూసింది కేవలం టైలర్ మాత్రమే ఇంకా త్వరలో ప్రతిపక్షాలకు బిఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతున్నదని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.