A place where you need to follow for what happening in world cup

కాలేజీ బస్సుఢీకొని జీహెచ్ఎంసి కార్మికురాలు మృతి

హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయమే విషాద ఘటన చోటుచేసుకుంది.  నారాయణ గూడ పోలీసు పరిధిలోని రామ్ కోట్ లో రోడ్లు ఊడుస్తున్న మహిళ సునీత ను ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ బస్సు ఢికొంది. ఘటన అమె అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొని ఆగిపోయింది.

ఘటనలో బస్సులోని నలుగురు విద్యార్దులకు గాయాలయ్యాయి.   రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని అయాన్ మెడికల్ కాలేజీకి చెందిన బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది.  ప్రమాదం నేపధ్యంలో అక్కడ భారీ ట్రాఫక్ జాం ఏర్పడింది. బస్యసు డ్రైవర్ మహమ్మద గౌస్ పై పోలీసులు కేసు నమోదు చేసారు.

Leave A Reply

Your email address will not be published.