A place where you need to follow for what happening in world cup

ఆదివాసి చట్టాలకు విరుద్ధంగా బౌల అంతస్తుల నిర్మాణాలు ఆపాలి

  • షెడ్యూల్ ప్రాంత చట్టాలకు విరుద్ధంగా ఇసుక అక్రమ తోలకాలను ఆపాలని మొక్కజొన్న విత్తన అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని
  • ఆదివాసి చట్టాలకు విరుద్ధంగా బౌల అంతస్తుల నిర్మాణాలు ఆపాలని అందుకు తోడ్పడుతున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలి
  • సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్

చర్ల మండలంలో అక్రమ ఇసుక తరలింపు ఆపాలని దానివల్ల రైతులకు పంటలకు పర్యావరణానికి జరిగే నష్టాలను అరికట్టాలని , మండలంలో బౌల జాతి కంపెనీలకు చెందిన మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కంపెనీల చట్టవేరుద్ద పోకోడలను అరికట్టాలని, భద్రాచలంలో భద్రాచలంలో ఆదివాసి చట్టాలకు విరుద్ధంగా 6 అంతస్తుల భవనం కోలాటం వలన ఇద్దరు కార్మికులు చనిపోవడానికి కారణమైన బిల్డింగ్ ఓనర్ను, అందుకు తోడ్పడిన ప్రభుత్వ అధికారులపై ముఖ్యంగా గ్రామపంచాయతీ ఈవో పై కఠినంగా చర్యలు తీసుకోవాలని షెడ్యూల్ ప్రాంత చట్టాలు ఉల్లంఘించడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి న్యాయం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే ఎల్లం వెంకటరావు గారికి ఫిర్యాదు పత్రం అందజేసి ఈ మూడు విషయాలను చర్చించడం జరిగింది.

విషయాలపై స్పందించిన ఎమ్మెల్యే సమస్యలపై కృషి చేస్తానని చెడు జరగకుండా కృషి చేస్తానని అవసరమైతే సమస్యల పరిష్కారంలో ప్రజలను మిమ్మల్ని భాగస్వామ్యలు చేస్తానని హామీ ఇచ్చారు ఈ ఫిర్యాదు చేసిన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు చర్చల రంగారెడ్డి జిల్లా నాయకురాలు జడ్చర్ల కల్పన చర్ల పార్టీ మండల కార్యదర్శి పాలెం చొక్కయ. పి డి ఎస్ యు మునిగేలా శివ ప్రశాంత్ భద్రాచలం డివిజన్ కార్యదర్శి, పి డి ఎస్ యు అధ్యక్షుడు రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.