A place where you need to follow for what happening in world cup

చిరుత పిల్లల కలకలం

tigress gave birth to two cubs

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి లో చిరుత పులి పిల్లతో సంచారం కలకలం రేపుతున్నది. గురువారం రాత్రి సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది.

ఈ క్రమంలో ఒక పిల్లను చిరుత తీసుకు వెళ్తుండగా తెల్లవారుజామున పొలం పనులకు వెళ్తున్న ఓ రైతు చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడ ఉన్న ఆ చిరుత పిల్లను చూసేందుకు జనాలు తరలివస్తున్నారు. చిరుత పిల్లతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి వచ్చి, ఆ చిరుత పిల్లను కరీంనగర్ తరలిస్తామని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.