- ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చిన పార్టీ పెద్దలు
- శ్రీహరి గెలుపునకు సహకరిస్తానని రాజయ్య ప్రకటన
- మంత్రి కేటీఆర్ తో సమావేశం అయిన ఇద్దరు నేతలు
అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు ఉప్పు-నిప్పుగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక్కటై చేతులు కలిపారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను కాదని సీఎం కేసీఆర్.. కడియంకు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి తీవ్ర అసహనంతో ఉన్న రాజయ్య.. కడియంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ మనసు మార్చుకొని మళ్లీ తనకే టికెట్ ప్రకటిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహాతో భేటీ అయ్యారు.