A place where you need to follow for what happening in world cup

ప్రజా ఆశీర్వాద పాద యాత్ర లో పుట్ట మధు కు స్వల్ప అస్వస్థత

మంథని నియోజక వర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్ర ఈ నెల 25న ముత్తారంలో ప్రారంభించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు భూపాలపల్లి జిల్లాలో ముగించుకొని సోమవారం మంథని మండలంలో ప్రవేశించగా మంగళవారం రామగిరి మండలం మండలంలోని బేగంపేట ఎక్స్ రోడు వరకు వచ్చేసరికి పుట్ట మధు కు స్వల్ప అస్వస్థత గురయ్యారు.

దీంతో వెంటనే బీఆర్ఎస్ నాయకులు అంబులెన్స్ పిలిపించి హుటాహుటిన మధును దావుఖానకు తరలించగా చికిత్స అందించిన వైద్యులు బిపి తగ్గిందని నీరసంగా ఉండడంతో కొన్ని రోజులు పాదయాత్ర వాయిదా వేసుకోమని చెప్పిన వినకుండా మధు యధావిదంగా పాదయాత్ర మళ్లి కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్ర మరో రెండు కిలోమీటర్లు రత్నాపూర్ వరకు కొనసాగనుంది.

Leave A Reply

Your email address will not be published.