నలుగురి అరెస్ట్..డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని రాజస్థాన్కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ శంషాబాద్, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితులు నలుగురూ రాజస్థాన్కు చెందిన వారేనని సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి డియాకు వెల్లడించారు. హెరాయిన్ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి.. బస్సుల్లో తీసుకొస్తున్నట్లు చెప్పారు.