A place where you need to follow for what happening in world cup

నీట్‌ ‌పరీక్ష పేపర్‌ ‌లీక్‌ ‌నిజమే

  • కేవలం 155మంది మాత్రమే లబ్ది పొందారు
  • మళ్లీ పరీక్ష నిర్వహించడం కుదరదు
  • దీనిపై సిబిఐ విచారణ సాగుతుంది
  • ‘సుప్రీమ్‌’ ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వైవి చంద్రచూడ్‌ ‌స్పష్టీకరణ

నీట్‌ ‌ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు  అభిప్రాయ పడింది. నీట్‌ అం‌శంపై విచారణ ముగియడంతో  సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్‌ ‌మళ్లీ నిర్వహిం చాలన్న డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌, ‌బిహార్‌ ‌లోని పట్నాలోని కేంద్రాల్లో నీట్‌-‌యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవం.

ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అందు బాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 155 మంది విద్యార్థులు లీక్‌ ‌వల్ల లబ్దిపొందినట్లు తెలుస్తోంది. ఈ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్థారణకు రావడం ప్రస్తుత దశలో కష్టం. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారు.

 

వారిలో అనేకమంది వందల కి.ల దూరం ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ‌పేర్కొన్నారు. ఈ ఏడాది నీట్‌ ‌ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు.

హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ ‌రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్‌ ‌ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ ‌మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే  ’ఫిజిక్స్ ‌వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ ‌పాండేతో పాటు మరి కొందరు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.

Leave A Reply

Your email address will not be published.