మధ్యంతర బెయిల్, సిబిఐ అరెస్ట్ను సవాలు చేస్తూ దాఖలైన కేజ్రీవాల్ పిటిషన్లపై దిల్లీ హైకోర్టు బుధవారం తీర్పు రిజర్వ్ చేసింది. సిబిఐ అరెస్ట్ను సవాలు చేయడమే కాకుండా, ఈ కేసులో బెయిల్ జారీ చేయాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. మొహరం సందర్భంగా సెలవు అయినప్పటికీ.. ఇరు పక్షాల వాదనలను విన్న జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణన్ తీర్పును రిజర్వ్ చేశార్గురెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణను దిల్లీ హైకోర్టు జులై 29కి జాబితా చేసింది.