A place where you need to follow for what happening in world cup

ఎన్నికల బందోబస్త్ కు పోలీస్ సిద్ధం డీఐజీ కె.రమేష్ నాయుడు సమీక్ష

రానున్న అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఎన్నికల బందోబస్త్ కు పోలీస్ అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కె.రమేష్ నాయుడు సూచించారు. మెదక్ జిల్లా నూతన పోలీస్ కార్యాలయాన్ని కె.రమేష్ నాయుడు, సందర్శించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న వివిధ విభాగాలను సందర్శించి జిల్లాలో నమోదవుతున్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డీఐజీ కె.రమేష్ నాయుడు మాట్లాడుతూ…

ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుందని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని ఓటరు జాబితా, ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు జారీ చేసిన మార్గదర్శకాల సముదాయం మోడల్ ప్రవర్తనా నియమావళి, ఎన్నికల తేదీలు ప్రకటించిన రోజు నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పాటించాల్సిన అంశాలు, ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర, భద్రతా దళాల డిప్లాయ్ మెంట్, నామినేషన్ దాఖలు నుండి ప్రచార పర్వం, పోలింగ్ రోజు నిర్వహణ తదితర అంశాలపై చేపట్టే ప్రణాళికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నికల సమావేశాలు, ప్రసంగాలు, నినాదాలు, పోస్టర్స్ మొదలైన వాటికి సంబంధించిన మార్గదర్శకాలు, ప్రచార వ్యవధి యొక్క నియంత్రణ, మోడల్ ప్రవర్తనా నియమావళి చట్టం, మోడల్ ప్రవర్తనా నియమావళి గురించి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్.పి.పి.రోహిణి ప్రియదర్శిని, జిల్లా అదనపు ఎస్.పి.ఎస్.మహేందర్, మెదక్ డి.ఎస్.పి..ఫణీంద్ర, తూప్రాన్ డి.ఎస్.పి యాదగిరి రెడ్డి, డి.సి.ఆర్.బి. డి.ఎస్.పి.శ్రీనివాస్ రెడ్డి, ఎస్.బి సి.ఐ సందీప్ రెడ్డి, జిల్లా సి.ఐ లు, ఎస్.ఐలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.