- సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం చేయూత
- ‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం ప్రారంభం
- సింగరేణి ఆర్థిక సాయంతో అభ్యర్థులకు భరోసా
- ఇక నుంచి ఏటా జూన్లో జాబ్ క్యాలెండర్
- డిసెంబర్ కల్లా అపాయింట్మెంట్లు
- నిరుద్యోగులకు అండగా నిలవడమే మా లక్ష్యం సిఎం రేవంత్ రెడ్డి వెల్లడి
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సివిల్స్ అభ్యర్థులకు చేయూతనిచ్చేలా ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ప్రజాభవన్లో శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు.
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశామని తెలిపారు. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామన్నారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరామ్ పాల్గొన్నారు.
ఉద్యోగ నియామకాల కోసమే రాష్టాన్న్రి సాధించుకున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. నిరుద్యోగుల బాధలు మాకు తెలుసు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చాం. టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించాం. పరీక్షలు మాటిమాటికి వాయిదా పడటం మంచిది కాదు. అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకుని గ్రూప్-2ను వాయిదా వేశాం. నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యం అని సిఎం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం. జూన్ 2న నోటిఫికేషన్, డిసెంబర్ 9 లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం.
సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున సాయం చేస్తున్నాం. మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా జాబ్ సాధించాలి. సివిల్స్ సాధించి మన రాష్టాన్రికే రావాలి. ఐఏఎస్, ఐపీఎస్లు మన వారైతే రాష్టాన్రికి మంచి జరుగుతుంది. నోటిఫికేషన్ ఇచ్చి సమయానికి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు గత పదేళ్లలో లేవు. అందుకు కారణమేదైనా యువత ఉజ్వల భవిష్యత్ ఆగమైంది. దురదృష్టవశాత్తూ కొన్నేళ్లుగా తెలంగాణలో యువత ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేదానికంటే.. పరీక్షల్లో జరిగే నిర్వహణ లోపాలపై కొట్లాడేందుకే వారి సమయం వృథా అయ్యింది. యూపీఎస్సీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా.. వాటిపై ఆరోపణలు లేవు. అందుకే మేం గతంలో యూపీఎస్సీ ఛైర్మన్ను కలిశాం. యూపీఎస్సీ తరహాలో కొన్ని మార్పులు చేసి వెంట వెంటనే నోటిఫికేషన్లు ఇస్తున్నామని రేవంత్రెడ్డి తెలిపారు. డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు.
నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్-2 పరీక్ష వాయిదా వేశామని చెప్పారు. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటామన్నారు. జూన్ 2 లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ తరఫున సాయం చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం. మరోవైపు, తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటుపై ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ వర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల విభాగం ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ యూనివర్శిటీలను పరిశీలించి.. స్కిల్ వర్శిటీ నమూనా ముసాయిదా తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఫార్మా, కన్స్టక్షన్్ర, బ్యాంకింగ్గ్•నాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్టస్ గేమింగ్ అండ్ కామిక్స్.. తొలుత ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులు ప్రవేశపెడతారని అన్నారు. తొలి ఏడాది 2 వేల మందితో ప్రారంభించి క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారని వివరించారు.