లౌకిక ప్రజాస్వామ్యానికి బిజెపి ప్రమాదకరం : పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్
ఎలక్ట్రొరల్ బాండ్స్ తో అవినీతిని చట్టబద్ధం: వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్
ఆర్ధిక వ్యవస్థను కుప్ప కూల్చిన బిజెపి: ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి
తెలంగాణ జనసమితి వర్క్ షాప్లో వక్తలు
కార్పొరేట్లకు దోచిపెట్టి నిరుద్యోగులకు మోసం..
టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం
తెలంగాణ జనసమితి అద్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నం చేయడం లేదు. పైపెచ్చు తాను అధికారంలోకి వొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో లక్షలాది శాశ్వత ఉద్యోగులను వి.ఆర్.ఎస్ తదితర పేర్లతో తొలగించారు. పర్మనెంట్ పోస్టులకు నీళ్లు వదిలి తాత్కాలిక జాబ్ మేలా ల పేరుతో కొత్త తరహా ఉద్యోగాలకు తెరలేపిండు. ఆఖరుకు అగ్నిపత్ పేరుతో సైన్యం లోని ఉద్యోగాలను తాత్కాలిక ఉద్యోగాలుగా మార్చిండు. వివిధ సర్వేల నివేదికల ప్రకారం దేశంలో 2.7 లక్షలు శాశ్వత ఉద్యోగాలు తగ్గిపోయాయి. రైతాంగానికి ఉరివేస్తూ, భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి కార్పొరేట్ శక్తులకు అప్పగించే మూడు చట్టాలను తీసుకువొచ్చి కనీస మద్దతు ధర అడిగిన రైతులపై అక్రమ కేసులతో నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, కొత్త కార్మిక చట్టాలను తెచ్చి యూనియన్ పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కులను తూట్లు పొడిచారు. ఈ నిర్ణయాల వలన దేశంలో అసమానతలు పెరిగాయి. ఈ రోజు 162 మంది బిలియనీర్లు 25 ఉత్పత్తిని 48 శాతం సంపదను అనుభవిస్తున్నారు.