A place where you need to follow for what happening in world cup

అట్టహాసంగా `అలయ్… బలయ్​’

  • హిందూ సంప్రదాయాలకు ప్రతీక
  • హాజరైన నాలుగు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు

నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో `అలయ్…బలయ్’ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ నాయకురాలు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖి, మురళీధరన్, కిషన్​రెడ్డి, హిమాచల్​ప్రదేశ్ ​గవర్నర్​ బండారు దత్తాత్రేయ, మిజోరాం గవర్నర్ హరిబాబు, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ రాత్, జార్ఖండ్ గవర్నర్ రాధాకిషన్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దన్వే, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ , సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, బీఆర్ఎస్ ఎంపీ కె కేశవ రావు, మాజీ ఎంపీలు వివేక్​, బూర నర్సయ్య గౌడ్, మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందూ సంప్రదాయాలకు ప్రతీక అలయ్​ బలయ్ ​కార్యక్రమం అని ప్రముఖులు వ్యాఖ్యానించారు. దసరా తర్వాత గత 17 ఏండ్లుగా హిందూ సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అలయ్– బలయ్ లేకుండా హైదరాబాద్ లో దసరా పూర్తి అయినట్టు కాదన్నారు. తెలంగాణ వంటకాలను దత్తాత్రేయ గత 17 ఏండ్లుగా అందిస్తున్నారని పేర్కొన్నారు. దసరా పేరుతో అందరిని ఒకే వేదికపై తీసుకరావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రాజకీయాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా అందరూ రావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఈ కార్యక్రమం కూడా అందరిని ఏకం చేసిందన్నారు. అలయ్–బలయ్ అంటే గుర్తు వచ్చేది దత్తాత్రేయ’ అని అన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ ముందుకు తీసుకెళుతుండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇదే విధంగా భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.