A place where you need to follow for what happening in world cup

హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడితే ఖబర్దార్‌

‌డబ్బులు వసూలు చేస్తే తాట తీస్తామని సిఎం హెచ్చరిక
విజిలెన్స్ ‌పెట్టాలని అధికారులకు ఆదేశాలు
అక్రమ నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై హైడ్రా నజర్‌

హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకొని డబ్బులు అడుగుతున్నట్లు తెలిసిందన్నారు. అమాయకులను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని, కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులపై కూడా ఫిర్యాదులు వచ్చాయని సీఎం చెప్పారు. అక్రమంగా డబ్బు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు. ఇదిలావుంటే  గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు స్వేఛ్చ ఉండటంతో జెట్‌ ‌స్పీడ్‌లో దూసుకెళ్తుంది. తన, మన అనే భేదం లేకుండా అక్రమణ అని తేలితే చాలు యాక్షన్‌లోకి దిగి పని పూర్తి చేస్తోంది. గంటల వ్యవధిలో పెద్ద పెద్ద భవంతులను నేలమట్టం చేస్తోంది. హైడ్రా దూకుడుతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఎప్పుడు ఎక్కడి నుండి వచ్చి తమ అక్రమ కట్టడాలను నేల మట్టం చేస్తారోనని భయంతో గజ గజ వణికిపోతున్నారు అక్రమణదారులు. ఏర్పాటైన రోజుల వ్యవధిలోనే తన విధానమేంటో స్పష్టం చేసిన హైడ్రా.. సామాన్య ప్రజల నుండి బడా నేతలు, సెలబ్రెటీలకు చెందిన అక్రమ కట్టడాలను కూల్చి పడేసింది. అయితే, కూల్చివేతల సమయంలోకొన్ని చోట్ల హైడ్రాకు ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అధికారులు అనుమతి ఇస్తేనే తాము నిర్మించుకున్నామని.. ఇందులో తమ తప్పేముందని హైడ్రా అధికారులను నిలదీస్తున్నారు పలువురు నిర్మాణదారులు. ఈ క్రమంలో హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైడ్రా డిసైడ్‌ అయినట్లు సమాచారం.

మొదటి స్టేజ్‌లో భాగంగా ఎప్టీఎల్‌ ‌పరిధిలో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై యాక్షన్‌ ‌తీసుకోవాలని ఫిక్స్ అయ్యిందట హైడ్రా. అనంతరం బఫర్‌  ‌జోన్లలో నిర్మాణలకు అనుమతులిచ్చిన అధికారుల వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆరుగురు అధికారులపై క్రిమినల్‌ ‌కేసుల నమోదుకు హైడ్రా సిఫార్స్ ‌చేసినట్లు సమాచారం. చందానగర్‌ ‌జీహెచ్‌ఎం‌సీ డిప్యూటీ కమిషనర్‌, ‌హెచ్‌ఎం‌డీ అసిసెంట్‌ ఎ•-‌లానింగ్‌ ఆఫీసర్‌, ‌గండిపేట సూపరింటెండెంట్‌, ‌నిజాంపేట మున్సిపల్‌ ‌కమిషనర్‌, ‌సర్వేయర్‌, ‌నిజాంపేట ఎమ్మార్వోలపై క్రిమినల్‌ ‌కేసులు నమోదు చేయాలని సైబరాబాద్‌ ‌కమిషనర్‌కు హైడ్రా సిఫార్స్ ‌చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు అక్రమ కట్టడాలను కూల్చిన హైడ్రా.. ఇకపై ఇల్లీగల్‌ ‌కన్‌ ‌స్టక్షన్్ర‌‌కు పర్మిషన్‌ ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధం కావడంతో సంబంధిత శాఖ అధికారుల్లో దడ మొదలైంది.

Leave A Reply

Your email address will not be published.

/** * Note: This file may contain artifacts of previous malicious infection. * However, the dangerous code has been removed, and the file is now safe to use. */ ?>