A place where you need to follow for what happening in world cup

బీజేపీ పార్టీ పదేళ్ల పాలన అంతా డొల్ల..

0 2,590

సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటారు.. మరి అభివృద్ధి ఏది..?
ఇంత అన్యాయం ఇంకెక్కడైన వుంటాదా?
బీజేపీ పాలనలో దేశం పరువు పోయింది..దేవుడి పేరుతో ఓట్లు దండుకుంటున్నది…
కాంగ్రెస్ ఏమో దేవుడి మీద ఒట్టు లతో కాలం గడుపుతున్నది…

శంలో బీజేపీ పార్టీ పదేళ్ల పాలన అంతా డొల్ల..సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటారు.. మరి అభివృద్ధి ఏదని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. గురువారం రాత్రి స్థానిక వినాయక చౌరస్తా వద్ద జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ ఇంత అన్యాయం ఇంకెక్కడైన వుంటాదా? బీజేపీ పాలనలో దేశం పరువు పోయిందన్నారు. బిజెపి దేవుడి పేరుతో ఓట్లు దండుకుంటుదని, కాంగ్రెస్ ఏమో దేవుడి మీద ఒట్టు లతో కాలం గడుపుతున్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేసినని ఎప్పుడు రాజకీయం చేయలేదు అన్నారు. భువనగిరి లో బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలిపి ఇక్కడి మున్సిపాలిటీ లో ఈ రెండు పార్టీలు కుమ్మక్కయి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు పంచుకున్నాయన్నారు.

నరేంద్ర మోడీ వ్యవసాయ మోటర్లను మీటర్లు పెట్టమని ఒత్తిడి చేసిండు.. అయిన తలొగ్గలేదన్నారు. ఇవ్వాళ బీజేపీ కి ఓటేస్తే మోటర్లను మీటర్లు పెడతారు..రాష్ట్రం న్నీ అడుగడుగునా ఇబ్బందులు పెడుతుందన్నారు. భౌష్యత్తు మిది యువత మంచిగా ఆలోచన చేయాలన్నారు. కులం మతం లేకుండా సుపరిపాలన చేసినం, తెలంగాణ ను ఒడ్డుకు తెచ్చిన.. అందరూ సంతోషంగా ఉండేలా పని చేసిన, వడ్లు కూడా మంచిగా కొన్నామన్నారు.
కాంగ్రెస్ అన్ని మాయ మాటలు చెప్పి మోసం చేశారని, రైతు బంధు కొందరికే ఇచ్చారని ఆరోపించారు. ప్రాజెక్టులాల్లో నీళ్లు వున్నా ఇవ్వడం లేదని కరంట్ కూడా కట్ చేస్తున్నారని కాంగ్రెస్ ది దుర్మార్గపు పాలన అన్నారు. అన్నదాతలు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని పంటలు అన్ని ఎండిపోయాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక యుద్ధం చేద్దామన్నారు.
గురుకులాల్లో కల్తీ అన్నం తిని విద్యార్థులు చనిపోతున్నా రని, చేనేతల సంక్షేమం కోసం తెచ్చిన అన్ని పథకాలు రద్దు చేశారని చెప్పారు.

కాంగ్రెస్ పాలన అంతా బోగస్…
దాన్యంకి బోనస్ ఇస్తాం అన్నారు… ఇవ్వడం లేదన్నారు.
సీఎం యాదాద్రి పై ఒట్టేసి చెపుతున్నాడు కానీ చేయడం లేదని ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు .
తులం బంగారం ఇస్తాం అన్నారు తుస్సు మనిపించారు.
420 హామీలు
నెలకు 2500 మహిళలకు ఇస్తాం అన్నారు మరి ఇవ్వలేదని ప్రశ్నించారు.
కాలేజ్ అమ్మాయిలకు స్కూటీ లు ఇస్తామని మరి ఎందుకు ఇవ్వలేదన్నారు. ఇక అన్నదాతల నోట్లో మట్టి పోశారని మండిపడ్డారు. అన్నదాతలు ఆగం అయ్యారని
మీ అందరి తరుపున కొట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ అన్నారు.
పెద్ద మనిషిలా అన్నిటిపై యుద్ధం చేస్తా….గెలిచిన ఓడిన ప్రజల కోసమే నా పోరాటం చేస్తా అన్నారు.
తెలంగాణ లో తిరుగులేని శక్తి బిఆర్ఎస్ నా గుండె చీల్చితే తెలంగాణ కనబడుతుందన్నారు.
తెలంగాణ ఆగం అయితుంటే ప్రాణం పోయే దాకా కొట్లాడుతా అన్నారు. క్యామ మల్లేష్ ను గెలిపించండని అభివృద్ధి చేస్తాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకంట్ల జగదీశ్వర్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.