సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని సిఎం రేవంత్ రెడ్డిని కమిటీ కోరింది. ఈమేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించింది.
ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తదితరులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.