మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 606 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 108, పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 106, విద్యుత్ శాఖ కు సంబంధించి 64, హౌజింగ్కు సంబంధించి 115 దరఖాస్తులు, మైనారిటీ సంక్షేమంశాఖకు సంబంధించి 38, ఇతర శాఖలకు సంబంధించి 175 దరఖాస్తులు అందినట్లు అధికా రులు తెలిపారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.