A place where you need to follow for what happening in world cup

పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం

సన్మానం చేసి చెక్కులను అందించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి

పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  బుధవారంఘనంగా సన్మానించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. చెక్కులు అందుకున్న వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్‌ ‌సోంలాల్‌ ఉన్నారు. చెక్కులను అందించిన సందర్బంగా ముఖ్యమంత్రికి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.